ఏపీ క‌రోనా బులిటెన్‌.. 24 గంట‌ల్లో 58 మంది మృతి

6770 New Corona Cases Reported In AP. ఏపీలో నిన్న‌టితో పోలిస్తే నేడు క‌రోనా కేసులు స్వ‌ల్పంగా త‌గ్గాయి. గ‌డిచిన 24 గంట‌ల్

By Medi Samrat  Published on  13 Jun 2021 11:36 AM GMT
ఏపీ క‌రోనా బులిటెన్‌.. 24 గంట‌ల్లో 58 మంది మృతి

ఏపీలో నిన్న‌టితో పోలిస్తే నేడు క‌రోనా కేసులు స్వ‌ల్పంగా త‌గ్గాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో 1,02,876 శాంపిళ్ల‌ను పరీక్షించ‌గా.. 6,770 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం సాయంత్రం విడుద‌ల చేసిన బులిటెన్‌లో వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 18,09,844కి చేరింది. నిన్న 12,492 మంది క‌రోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 17,12,267కి పెరిగింది.

కోవిడ్ వల్ల చిత్తూర్ లో పన్నెండు మంది, తూర్పు గోదావరిలో ఏడుగురు, పశ్చిమ గోదావరిలో ఏడుగురు, శ్రీకాకుళం లో ఆరుగురు, అనంతపూర్ లో నలుగురు, విశాఖపట్నం లో నలుగురు, వైఎస్ఆర్ కడప లో ముగ్గురు, కృష్ణ లో ముగ్గురు, ప్రకాశంలో ముగ్గురు, విజయనగరం లో ముగ్గురు, గుంటూరు లో ఇద్దరు, కర్నూల్ లో ఇద్దరు, నెల్లూరులో ఇద్దరు చొప్పున మొత్తం 58 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో రాష్ట్రంలో క‌రోనా వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 11,940కి చేరింది. ఇక రాష్ట్రంలో 85,637 యాక్టివ్ కేసులు ఉండ‌గా.. నేటి వరకు రాష్ట్రంలో 2,04,50,982 సాంపిల్స్ ని పరీక్షించారు.


Next Story