ఏపీ కరోనా బులిటెన్.. కొత్తగా ఎన్ని కేసులంటే..
629 New Corona Cases Reported In AP. ఆంధ్రప్రదేశ్లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 45,818 పరీక్షలు
By Medi Samrat Published on
9 Oct 2021 1:47 PM GMT

ఆంధ్రప్రదేశ్లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 45,818 పరీక్షలు నిర్వహించగా.. 629 కేసులు నిర్ధారణ అయినట్లు శనివారం సాయంత్రం విడుదల చేసిన హెల్త్ బులిటెన్లో రాష్ట్ర వైద్యా రోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,56,628కి చేరింది. నిన్న కరోనా వల్ల ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 14,250కి చేరింది. 24 గంటల వ్యవధిలో 797 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 20,34,244కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 8,134 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,87,06,629 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.
Next Story