ఏపీ క‌రోనా బులిటెన్‌.. 24 గంట‌ల్లో తొమ్మిది మంది మృత్యువాత‌

5879 New Corona Cases reported In AP. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ సృష్టిస్తోంది. రాష్ట్రంలో కరోనా కేసులు

By Medi Samrat  Published on  31 Jan 2022 11:56 AM GMT
ఏపీ క‌రోనా బులిటెన్‌.. 24 గంట‌ల్లో తొమ్మిది మంది మృత్యువాత‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ సృష్టిస్తోంది. రాష్ట్రంలో కరోనా కేసులు సంఖ్య మళ్లీ 5 వేలకుపైగా నమోదయ్యాయి. కేసులు పెర‌గుతుండటంతో మ‌ర‌ణాలు కూడా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 25,284 పరీక్షలు నిర్వహించగా.. 5,879 కొత్త పాజిటివ్ కేసులు నిర్ధారణ అయిన‌ట్లు సోమ‌వారం సాయంత్రం విడుద‌ల చేసిన హెల్త్ బులిటెన్‌లో రాష్ట్ర వైద్యా రోగ్య శాఖ వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 22,76,370కి చేరింది.

క‌రోనా వ‌ల్ల నిన్న తొమ్మిది మంది మృత్యువాత ప‌డ్డారు. కోవిడ్ వల్ల కర్నూలు మరియు నెల్లూరు లలో ఇద్దరు, చిత్తూరు, కడప, కృష్ణా, ప్రకాశం మరియు విశాఖపట్నం లలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 14,615గా ఉంది. 24 గంటల వ్యవధిలో 11,384 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 21,51,238కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,10,517 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 3,24,70,712 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.


Next Story