ఏపీ క‌రోనా బులిటెన్‌.. మ‌ళ్లీ పెరిగిన కేసులు.. ఒకే రోజులో 53 మ‌ర‌ణాలు

5741 New Corona Cases Reported In AP. ఏపీలో నిన్న‌టితో పోలిస్తే నేడు క‌రోనా కేసులు భారీగా త‌గ్గాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో

By Medi Samrat  Published on  15 Jun 2021 12:18 PM GMT
ఏపీ క‌రోనా బులిటెన్‌.. మ‌ళ్లీ పెరిగిన కేసులు.. ఒకే రోజులో 53 మ‌ర‌ణాలు

ఏపీలో నిన్న‌టితో పోలిస్తే నేడు క‌రోనా కేసులు భారీగా త‌గ్గాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో 96,153 శాంపిళ్ల‌ను పరీక్షించ‌గా.. 5,741 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంగ‌ళవారం సాయంత్రం విడుద‌ల చేసిన బులిటెన్‌లో వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 18,20,134కి చేరింది. నిన్న 10,567 మంది క‌రోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 17,32,948కి పెరిగింది.

కోవిడ్ వల్ల చిత్తూర్ లో పన్నెండు మంది, తూర్పు గోదావరి లో ఆరుగురు, వైఎస్ఆర్ కడపలో నలుగురు, కృష్ణ లో నలుగురు, ప్రకాశం లో నలుగురు, శ్రీకాకుళం లో నలుగురు, విశాఖపట్నం లో నలుగురు, అనంతపూర్ లో ముగ్గురు, గుంటూరు లో ముగ్గురు, పశ్చిమ గోదావరి లో ముగ్గురు, కర్నూల్ లో ఇద్దరు, నెల్లూరు లో ఇద్దరు, విజయనగరం లో ఇద్దరు చొప్పున మొత్తం 53 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో రాష్ట్రంలో క‌రోనా వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 12,052కి చేరింది. ఇక రాష్ట్రంలో 75,134 యాక్టివ్ కేసులు ఉండ‌గా.. నేటి వరకు రాష్ట్రంలో 2,06,34,891 సాంపిల్స్ ని పరీక్షించారు.


Next Story