ఏపీ క‌రోనా బులిటెన్‌.. త‌గ్గిన కేసులు, మ‌ర‌ణాలు

5674 New Corona Cases Reported In AP. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కరోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 1,03,935

By Medi Samrat  Published on  19 Jun 2021 12:39 PM GMT
ఏపీ క‌రోనా బులిటెన్‌.. త‌గ్గిన కేసులు, మ‌ర‌ణాలు
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కరోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 1,03,935 శాంపిళ్ల‌ను పరీక్షించ‌గా.. 5,674 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ శ‌నివారం సాయంత్రం విడుద‌ల చేసిన బులిటెన్‌లో వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 18,44,917కి చేరింది. నిన్న 8,014 మంది క‌రోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 17,67,404కి పెరిగింది.

కోవిడ్ వల్ల వల్ల చిత్తూర్ లో తొమ్మిది, తూర్పు గోదావరి లో ఐదుగురు, గుంటూరు లో ఐదుగురు, కృష్ణ లో ఐదుగురు, అనంతపూర్ లో ముగ్గురు, శ్రీకాకుళం లో ముగ్గురు, విశాఖపట్నం లో ముగ్గురు, పశ్చిమ గోదావరి లో ముగ్గురు, వైఎస్ఆర్ కడప లో ఇద్దరు, కర్నూల్ లో ఇద్దరు, ప్రకాశం లో ఇద్దరు, విజయనగరం లో ఇద్దరు, నెల్లూరు లో ఒక్కరు చొప్పున 45 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో రాష్ట్రంలో క‌రోనా వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 12,269కి చేరింది. ఇక రాష్ట్రంలో 65,244 యాక్టివ్ కేసులు ఉండ‌గా.. నేటి వరకు రాష్ట్రంలో 2,10,50,846 సాంపిల్స్ ని పరీక్షించారు.


Next Story