ఏపీ క‌రోనా బులిటెన్‌.. త‌గ్గిన కేసులు, పెరిగిన మ‌ర‌ణాలు

5646 New Corona Cases Reported In AP. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కరోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 1,00,001 శాంపిళ్ల‌ను పరీక్షించ‌గా..

By Medi Samrat  Published on  20 Jun 2021 12:13 PM GMT
ఏపీ క‌రోనా బులిటెన్‌.. త‌గ్గిన కేసులు, పెరిగిన మ‌ర‌ణాలు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కరోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 1,00,001 శాంపిళ్ల‌ను పరీక్షించ‌గా.. 5,646 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం సాయంత్రం విడుద‌ల చేసిన బులిటెన్‌లో వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 18,50,563కి చేరింది. నిన్న 7,772 మంది క‌రోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 17,75,176కి పెరిగింది.

కోవిడ్ వల్ల చిత్తూర్ లో పదకొండు మంది, పశ్చిమ గోదావరిలో ఏడుగురు, గుంటూరు లో ఆరుగురు, తూర్పు గోదావరి లో ఐదుగురు, శ్రీకాకుళం లో నలుగురు, అనంతపూర్ లో ముగ్గురు, వైఎస్ఆర్ కడప లో ముగ్గురు, కృష్ణ లో ముగ్గురు, ప్రకాశం లో ముగ్గురు, కర్నూల్ లో ఇద్దరు, విశాఖపట్నం లో ఇద్దరు, నెల్లూరు లో ఒక్కరు చొప్పున 50 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో రాష్ట్రంలో క‌రోనా వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 12,319కి చేరింది. ఇక రాష్ట్రంలో 63,068 యాక్టివ్ కేసులు ఉండ‌గా.. నేటి వరకు రాష్ట్రంలో 2,11,50,847 సాంపిల్స్ ని పరీక్షించారు.


Next Story