ఉక్రెయిన్‌ నుండి ఏపీకి చేరుకున్న 558 మంది విద్యార్థులు.. ఇంకా 86 మంది విద్యార్థులు..

558 students return from Ukraine, more 86 to be repatriated today. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న విద్యార్థులను రాష్ట్ర ప్రభుత్వం వేగంగా తీసుకువస్తోంది. గడిచిన 24 గంటల్లో 109 మంది విద్యార్థులను

By అంజి  Published on  7 March 2022 5:15 AM GMT
ఉక్రెయిన్‌ నుండి ఏపీకి చేరుకున్న 558 మంది విద్యార్థులు.. ఇంకా 86 మంది విద్యార్థులు..

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న విద్యార్థులను రాష్ట్ర ప్రభుత్వం వేగంగా తీసుకువస్తోంది. గడిచిన 24 గంటల్లో 109 మంది విద్యార్థులను స్వదేశానికి రప్పించగా ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 558 మంది విద్యార్థులు సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారు. మొత్తం 770 మంది విద్యార్థులు ఉక్రెయిన్‌లో ఉన్నారని, మిగిలిన వారిని కూడా త్వరలోనే స్వదేశానికి రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు తెలిపారు. ఉక్రెయిన్‌లో ఉన్న మరో 86 మంది విద్యార్థులను సురక్షితంగా రొమేనియాకు తరలించినట్లు రాష్ట్ర ప్రభుత్వ ఎన్నారై డిప్యూటీ అడ్వైజర్ చంద్రహాస్ రెడ్డి తెలిపారు.

రాష్ట్రానికి చెందిన హంగేరీ విద్యార్థులు దాదాపు ఆంధ్రప్రదేశ్‌కు చేరుకున్నారని అక్కడి పరిస్థితిని పర్యవేక్షిస్తున్న ఏపీఎన్‌ఆర్‌టీ అధ్యక్షుడు వెంకట్ మేడపాటి తెలిపారు. ఉక్రెయిన్ నుంచి హంగేరీకి మరో 1100 మంది భారతీయులు వస్తున్నట్లు తమకు సమాచారం అందిందని రాయబార కార్యాలయం తెలిపింది. కాగా, ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన 109 మంది ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఆదివారం ఢిల్లీకి చేరుకున్నారు. ఉక్రెయిన్ సరిహద్దు దేశాల నుంచి వచ్చే వారందరికీ ఏపీ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాష్ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సౌకర్యాలు ఏర్పాటు చేశారు.

Next Story