ఏపీ కరోనా బులిటెన్ విడుదల
538 Corona Cases In AP. ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 538 పాజిటివ్ కేసులు నమోదు కాగా
By Medi Samrat Published on
10 Dec 2020 12:48 PM GMT

ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 538 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇద్దరు మరణించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మృతుల సంఖ్య 7,047కు చేరగా, పాజిటివ్ కేసుల సంఖ్య 8,73,995కు చేరింది. తాజాగా 558 మంది కరోనా నుంచి కోలుకోగా, ప్రస్తుతం రాష్ట్రంలో 5,237 యాక్టివ్ కేసులున్నట్లు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.
ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,06,35,197 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు తెలిపింది. ఇక గడిచిన 24 గంటల్లో అత్యధికంగా చిత్తూరులో 95, గుంటూరులో 72, కృష్ణలో 86 కేసులు, ఈస్ట్ గోదావరిలో 50, పశ్చిమగోదావరిలో 72 కేసులు నమోదు కాగా.. మిగతా జిల్లాల్లో యాభై లోపు కేసులు నమోదయ్యాయి.
Next Story