ఏపీ కరోనా బులిటెన్.. స్వల్పంగా పెరిగిన కేసులు
523 New Corona Cases Reported In AP. ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 44,086 పరీక్షలు
By Medi Samrat Published on
20 Oct 2021 12:02 PM GMT

ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 44,086 పరీక్షలు నిర్వహించగా.. 523 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు బుధవారం సాయంత్రం విడుదల చేసిన హెల్త్ బులిటెన్లో రాష్ట్ర వైద్యా రోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,61,810కి చేరింది. నిన్న కరోనా వల్ల ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 14,320కి చేరింది. 24 గంటల వ్యవధిలో 608 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 20,41,924కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 5,566 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,91,00,342 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది
Next Story