ఏపీ కరోనా బులిటెన్.. కొత్తగా ఎన్ని కేసులంటే..
517 New Corona Cases reported In AP. ఆంధ్రప్రదేశ్లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 38,786
By Medi Samrat Published on
13 Oct 2021 11:25 AM GMT

ఆంధ్రప్రదేశ్లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 38,786 పరీక్షలు నిర్వహించగా.. 517 కేసులు నిర్ధారణ అయినట్లు బుధవారం సాయంత్రం విడుదల చేసిన హెల్త్ బులిటెన్లో రాష్ట్ర వైద్యా రోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,58,582కి చేరింది. నిన్న కరోనా వల్ల 8 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 14,276కి చేరింది. 24 గంటల వ్యవధిలో 826 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 20,37,691కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 6,615 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,88,39,595 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.
Next Story