ఏపీ క‌రోనా బులిటెన్‌.. స్వ‌ల్పంగా పెరిగిన కేసులు

49 New Corona Cases Reported In AP. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌ట్టాయి. గ‌త కొద్ది రోజులుగా వంద లోపే పాజిటివ్ కేసులు

By Medi Samrat  Published on  20 March 2022 11:45 AM GMT
ఏపీ క‌రోనా బులిటెన్‌.. స్వ‌ల్పంగా పెరిగిన కేసులు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌ట్టాయి. గ‌త కొద్ది రోజులుగా వంద లోపే పాజిటివ్ కేసులు న‌మోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 9,580 పరీక్షలు నిర్వహించగా.. 49 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయిన‌ట్లు ఆదివారం సాయంత్రం విడుద‌ల చేసిన హెల్త్ బులిటెన్‌లో రాష్ట్ర వైద్యా రోగ్య శాఖ వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 23,19,230కి చేరింది. క‌రోనా కార‌ణంగా నిన్న ఎవ్వ‌రూ ప్రాణాలు కోల్పోలేదు. రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి నేటి వ‌ర‌కు 14,730 మంది మ‌ర‌ణించారు. 24 గంటల వ్యవధిలో 56 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 23,03,989కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 511 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 3,33,32,416 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.








Next Story