ఏపీ కరోనా బులిటెన్‌.. తగ్గిన కేసులు, పెరిగిన మరణాలు

4,605 New corona cases reported in AP. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రంలో కరోనా మహమ్మారి కలకలం సృష్టిస్తోంది. రాష్ట్రంలో కరోనా కేసులు సంఖ్య 4 వేలకుపైగా నమోదయ్యాయి.

By అంజి  Published on  3 Feb 2022 12:55 PM GMT
ఏపీ కరోనా బులిటెన్‌.. తగ్గిన కేసులు, పెరిగిన మరణాలు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రంలో కరోనా మహమ్మారి కలకలం సృష్టిస్తోంది. రాష్ట్రంలో కరోనా కేసులు సంఖ్య 4 వేలకుపైగా నమోదయ్యాయి. కేసులు పెర‌గుతుండటంతో మ‌ర‌ణాలు కూడా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 30,578 పరీక్షలు నిర్వహించగా.. 4,605 కొత్త పాజిటివ్ కేసులు నిర్ధారణ అయిన‌ట్లు గురువారం సాయంత్రం విడుద‌ల చేసిన హెల్త్ బులిటెన్‌లో రాష్ట్ర వైద్యా రోగ్య శాఖ వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 22,93,171కి చేరింది.

క‌రోనా వ‌ల్ల నిన్న పది మంది మృత్యువాత ప‌డ్డారు. కోవిడ్ వల్ల అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో ఇద్దరు చొప్పున, చిత్తూరు, గుంటూరు, ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పు న మరణించారు. రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 14,641గా ఉంది. 24 గంటల వ్యవధిలో 11,729 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 21,85,042 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 93,488 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 3,25,71,365 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.

Next Story