ఏపీ క‌రోనా బులిటెన్‌.. కొత్త‌గా ఎన్ని కేసులంటే..

4458 New Corona Cases Reported In AP. నిన్న‌టితో పోలిస్తే ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా కేసులు స్వ‌ల్పంగా పెరిగాయి.

By Medi Samrat  Published on  25 Jun 2021 12:22 PM GMT
ఏపీ క‌రోనా బులిటెన్‌.. కొత్త‌గా ఎన్ని కేసులంటే..

నిన్న‌టితో పోలిస్తే ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా కేసులు స్వ‌ల్పంగా పెరిగాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో 91,849 శాంపిళ్ల‌ను పరీక్షించ‌గా.. 4,458 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ శుక్ర‌వారం సాయంత్రం విడుద‌ల చేసిన బులిటెన్‌లో వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 1871475కి చేరింది. నిన్న 6,313 మంది క‌రోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 18,11,157కి పెరిగింది.

కోవిడ్ వల్ల చిత్తూర్ లో తొమ్మిది, కృష్ణ లో ఎనిమిది, గుంటూరు లో ఐదుగురు, తూర్పుగోదావరి లో నలుగురు, కర్నూల్ లో ఇద్దరు, శ్రీకాకుళం లో ఇద్దరు, విశాఖపట్నం లో ఇద్దరు, విజయనగరం లో ఇద్దరు, అనంతపూర్ లో ఒక్కరు, వైఎస్ఆర్ కడప లో ఒక్కరు, నెల్లూరు లో ఒక్కరు, పశ్చిమ గోదావరి లో ఒక్కరు చొప్పున మొత్తం 38 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో క‌రోనా వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 12,528కి చేరింది. ఇక రాష్ట్రంలో 47,790 యాక్టివ్ కేసులు ఉండ‌గా.. నేటి వరకు రాష్ట్రంలో 2,15,41,485 సాంపిల్స్ ని పరీక్షించారు.


Next Story