ఏపీ కరోనా బులిటెన్ విడుదల
438 Corona Cases In AP. ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 438 పాజిటివ్ కేసులు నమోదు
By Medi Samrat Published on
20 Dec 2020 12:07 PM GMT

ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 438 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇద్దరు మరణించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మృతుల సంఖ్య 7076కు చేరగా, పాజిటివ్ కేసుల సంఖ్య 8,78,723కు చేరింది. తాజాగా 589 మంది కరోనా నుంచి కోలుకోగా, ప్రస్తుతం రాష్ట్రంలో 4,202 యాక్టివ్ కేసులున్నట్లు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.
ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,12,60,810 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు తెలిపింది. ఇక గడిచిన 24 గంటల్లో అత్యధికంగా చిత్తూరులో 80, గుంటూరులో 54, కృష్ణలో 83 కేసులు నమోదు కాగా.. మిగతా జిల్లాల్లో తక్కువ సంఖ్యలో కేసులు నమోదయ్యాయి.
Next Story