ఏపీ క‌రోనా బులిటెన్‌.. మ‌ళ్లీ పెరిగిన కేసులు, మ‌ర‌ణాలు

4169 New Corona Cases Reported In AP. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కరోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 74,453 శాంపిళ్ల‌ను పరీక్షించ‌గా..

By Medi Samrat  Published on  22 Jun 2021 12:30 PM GMT
ఏపీ క‌రోనా బులిటెన్‌.. మ‌ళ్లీ పెరిగిన కేసులు, మ‌ర‌ణాలు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కరోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 74,453 శాంపిళ్ల‌ను పరీక్షించ‌గా.. 4,169 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంగ‌ళ‌వారం సాయంత్రం విడుద‌ల చేసిన బులిటెన్‌లో వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 18,57,352కి చేరింది. నిన్న 8,376 మంది క‌రోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 17,91,056కి పెరిగింది.

కోవిడ్ వల్ల చిత్తూర్ లో ఏడుగురు, తూర్పు గోదావరి లో ఆరుగురు, ప్రకాశం లో ఆరుగురు, కృష్ణ లో ఐదుగురు, శ్రీకాకుళం లో ఐదుగురు, అనంతపూర్ లో నలుగురు, వైఎస్ఆర్ కడపలో నలుగురు, నెల్లూరు లో నలుగురు, విశాఖపట్నం లో ముగ్గురు, పశ్చిమ గోదావరి లో ముగ్గురు, గుంటూరు లో ఇద్దరు, కర్నూల్ లో ఇద్దరు, విజయనగరం లో ఇద్దరు చొప్పున 53 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో రాష్ట్రంలో క‌రోనా వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 12,416కి చేరింది. ఇక రాష్ట్రంలో 53,880 యాక్టివ్ కేసులు ఉండ‌గా.. నేటి వరకు రాష్ట్రంలో 2,12,80,302 సాంపిల్స్ ని పరీక్షించారు.


Next Story