ఏపీలో స్వ‌ల్పంగా పెరిగిన క‌రోనా కేసులు

415 New Corona Cases Reported In AP. ఏపీలో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 33,944 పరీక్షలు

By Medi Samrat  Published on  26 Oct 2021 2:12 PM GMT
ఏపీలో స్వ‌ల్పంగా పెరిగిన క‌రోనా కేసులు

ఏపీలో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 33,944 పరీక్షలు నిర్వహించగా.. 415 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయిన‌ట్లు మంగ‌ళ‌వారం సాయంత్రం విడుద‌ల చేసిన హెల్త్ బులిటెన్‌లో రాష్ట్ర వైద్యా రోగ్య శాఖ వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,64,287కి చేరింది. నిన్న క‌రోనా వ‌ల్ల ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 14,356కి చేరింది. 24 గంటల వ్యవధిలో 584 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 20,45,276కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,655 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,93,25,840 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.



Next Story