ఏపీ క‌రోనా బులిటెన్‌.. స్వ‌ల్పంగా త‌గ్గిన కేసులు.. మ‌ర‌ణాలు మాత్రం..

4147 New Corona Cases Reported In AP. నిన్న‌టితో పోలిస్తే ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా కేసులు స్వ‌ల్పంగా పెరిగాయి.

By Medi Samrat  Published on  26 Jun 2021 12:50 PM GMT
ఏపీ క‌రోనా బులిటెన్‌.. స్వ‌ల్పంగా త‌గ్గిన కేసులు.. మ‌ర‌ణాలు మాత్రం..

నిన్న‌టితో పోలిస్తే ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా కేసులు స్వ‌ల్పంగా పెరిగాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో 96,121 శాంపిళ్ల‌ను పరీక్షించ‌గా.. 4,147 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ శ‌నివారం సాయంత్రం విడుద‌ల చేసిన బులిటెన్‌లో వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 18,75,622కి చేరింది. నిన్న 5,773 మంది క‌రోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 18,16,930కి పెరిగింది.

కోవిడ్ వల్ల చిత్తూర్ లో ఏడుగురు, గుంటూరు లో ఏడుగురు, తూర్పు గోదావరి లో ఐదుగురు, కృష్ణ లో ఐదుగురు, శ్రీకాకుళం లో నలుగురు, పశ్చిమ గోదావరి లో ముగ్గురు, అనంతపూర్ లో ఇద్దరు, వైఎస్ఆర్ కడప లో ఇద్దరు, విశాఖపట్నం లో ఇద్దరు, విజయనగరంలో ఒక్కరు చొప్పున మొత్తం 38 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో క‌రోనా వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 12,566కి చేరింది. ఇక రాష్ట్రంలో 46,126 యాక్టివ్ కేసులు ఉండ‌గా.. నేటి వరకు రాష్ట్రంలో 2,16,37,606 సాంపిల్స్ ని పరీక్షించారు.




Next Story