ఏపీ క‌రోనా బులిటెన్‌.. 24 గంట‌ల్లో తొమ్మిది మంది మృత్యువాత‌

3396 New Corona Cases Reported In AP. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ ఆగడం లేదు. రాష్ట్రంలో ఇవాళ కూడా

By Medi Samrat  Published on  5 Feb 2022 12:19 PM GMT
ఏపీ క‌రోనా బులిటెన్‌.. 24 గంట‌ల్లో తొమ్మిది మంది మృత్యువాత‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ ఆగడం లేదు. రాష్ట్రంలో ఇవాళ కూడా కరోనా కేసులు సంఖ్య 3 వేలకుపైగా నమోదయ్యాయి. నిన్నటితో పోల్చితే ఇవాళ కరోనా మరణాలు పెరిగాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 29,838 పరీక్షలు నిర్వహించగా.. 3,396 కొత్త పాజిటివ్ కేసులు నిర్ధారణ అయిన‌ట్లు శ‌నివారం సాయంత్రం విడుద‌ల చేసిన హెల్త్ బులిటెన్‌లో రాష్ట్ర వైద్యా రోగ్య శాఖ వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 23,00,765 కి చేరింది.

క‌రోనా వ‌ల్ల నిన్న తొమ్మిది మంది మృత్యువాత ప‌డ్డారు. కోవిడ్ వల్ల అనంతపురము, నెల్లూరు మరియు ప్రకాశం లలో ఇద్దరు, చిత్తూరు, గుంటూరు మరియు కర్నూలు లలో ఒక్కొక్కరు చొప్పు న మరణించారు. రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 14,655గా ఉంది. 24 గంటల వ్యవధిలో 13,005 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 22,07,364కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 78,746 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 3,26,32,089 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.


Next Story