ఏపీ కరోనా బులిటెన్.. పెరిగిన మరణాలు
2982 New Corona Cases Reported In AP. నిన్నటితో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గాయి.
By Medi Samrat Published on
8 July 2021 11:43 AM GMT

నిన్నటితో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 91,070 శాంపిళ్లను పరీక్షించగా.. 2,982 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ గురువారం సాయంత్రం విడుదల చేసిన బులిటెన్లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 19,14,213కి చేరింది. నిన్న 3,461 మంది కరోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 18,69,417కి పెరిగింది.
కోవిడ్ వల్ల ప్రకాశంలో ఆరుగురు, కృష్ణ లో ఐదుగురు, చిత్తూర్ లో నలుగురు, తూర్పుగోదావరి లో నలుగురు, అనంతపూర్ లో ఇద్దరు, గుంటూరు, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరంలో ఒకరు పశ్చిమ గోదావరిలలో ఒకరు చొప్పున మొత్తం 27 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 12,946కి చేరింది. ఇక రాష్ట్రంలో 31,850 యాక్టివ్ కేసులు ఉండగా.. నేటి వరకు రాష్ట్రంలో 2,26,99,142 సాంపిల్స్ ని పరీక్షించారు.
Next Story