ఏపీ క‌రోనా బులిటెన్‌.. పెరిగిన మ‌ర‌ణాలు

2925 New Corona Cases Reported In AP. నిన్న‌టితో పోలిస్తే ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా కేసుల సంఖ్య స్వ‌ల్పంగా త‌గ్గాయి.

By Medi Samrat  Published on  10 July 2021 1:32 PM GMT
ఏపీ క‌రోనా బులిటెన్‌.. పెరిగిన మ‌ర‌ణాలు

నిన్న‌టితో పోలిస్తే ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా కేసుల సంఖ్య స్వ‌ల్పంగా త‌గ్గాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో 95,366 శాంపిళ్ల‌ను పరీక్షించ‌గా.. 2,925 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ శ‌నివారం సాయంత్రం విడుద‌ల చేసిన బులిటెన్‌లో వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 19,20,178కి చేరింది. నిన్న 3,937 మంది క‌రోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 18,77,930కి పెరిగింది.

కోవిడ్ వల్ల చిత్తూర్ లో ఐదుగురు, కృష్ణ లో ఐదుగురు, తూర్పు గోదావరిలో నలుగురు, కర్నూల్ లో ఇద్దరు, నెల్లూరు లో ఇద్దరు, శ్రీకాకుళం లో ఇద్దరు, విజయనగరంలో ఇద్దరు, వైఎస్ఆర్ కడప, ప్రకాశం , విశాఖపట్నం మరియు పశ్చిమ గోదావరి లలో ఒక్కొక్కరు చొప్పున మొత్తం 26 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో క‌రోనా వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 12,986కి చేరింది. ఇక రాష్ట్రంలో 29,262 యాక్టివ్ కేసులు ఉండ‌గా.. నేటి వరకు రాష్ట్రంలో 2,28,94,611 సాంపిల్స్ ని పరీక్షించారు.



Next Story