ఏపీ క‌రోనా బులిటెన్‌.. 24 గంట‌ల్లో తొమ్మిది మంది మృత్యువాత‌..

2690 New Corona Cases Reported In AP. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ ఆగడం లేదు. రాష్ట్రంలో ఇవాళ కూడా

By Medi Samrat  Published on  6 Feb 2022 11:54 AM GMT
ఏపీ క‌రోనా బులిటెన్‌.. 24 గంట‌ల్లో తొమ్మిది మంది మృత్యువాత‌..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ ఆగడం లేదు. రాష్ట్రంలో ఇవాళ కూడా కరోనా కేసులు సంఖ్య 2 వేలకుపైగా నమోదయ్యాయి. నిన్నటితో స‌మానంగా ఇవాళ కరోనా మరణాలు న‌మోద‌య్యాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 28,598 పరీక్షలు నిర్వహించగా.. 2,690 కొత్త పాజిటివ్ కేసులు నిర్ధారణ అయిన‌ట్లు ఆదివారం సాయంత్రం విడుద‌ల చేసిన హెల్త్ బులిటెన్‌లో రాష్ట్ర వైద్యా రోగ్య శాఖ వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 23,03,455కి చేరింది.

క‌రోనా వ‌ల్ల నిన్న తొమ్మిది మంది మృత్యువాత ప‌డ్డారు. కోవిడ్ వల్ల ప్రకాశం లో ఇద్దరు, అనంతపురం, చిత్తూరు, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, విశాఖపట్నం మరియు విజయనగరం లలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 14,664గా ఉంది. 24 గంటల వ్యవధిలో 11,855 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 22,19,219కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 69,572 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 3,26,60,687 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.


Next Story