ఏపీ క‌రోనా బులిటెన్‌.. భారీగా త‌గ్గిన కేసులు

2620 New Corona Cases Reported In AP. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కరోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 55,002 శాంపిళ్ల‌ను పరీక్షించ‌గా..

By Medi Samrat  Published on  21 Jun 2021 11:24 AM GMT
ఏపీ క‌రోనా బులిటెన్‌.. భారీగా త‌గ్గిన కేసులు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కరోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 55,002 శాంపిళ్ల‌ను పరీక్షించ‌గా.. 2,620 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సోమ‌వారం సాయంత్రం విడుద‌ల చేసిన బులిటెన్‌లో వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 18,53,183కి చేరింది. నిన్న 7,504 మంది క‌రోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 17,82,680కి పెరిగింది.

కోవిడ్ వల్ల చిత్తూర్ లో పది మంది, గుంటూరు లో ఐదుగురు, శ్రీకాకుళం లో ఐదుగురు, తూర్పు గోదావరి లో నలుగురు, అనంతపూర్ లో ముగ్గురు, కర్నూల్ లో ముగ్గురు, ప్రకాశంలో ముగ్గురు, విశాఖపట్నం లో ముగ్గురు, పశ్చి మ గోదావరి లో ముగ్గురు, కృష్ణ లో ఇద్దరు, వైఎస్ఆర్ కడపలో ఒక్క రు, నెల్లూరు లో ఒక్కరు, విజయనగరం లో ఒక్కరు చొప్పున 44 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో రాష్ట్రంలో క‌రోనా వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 12,363కి చేరింది. ఇక రాష్ట్రంలో 58,140 యాక్టివ్ కేసులు ఉండ‌గా.. నేటి వరకు రాష్ట్రంలో 2,12,05,849 సాంపిల్స్ ని పరీక్షించారు.


Next Story