ఏపీ క‌రోనా బులిటెన్‌.. స్వ‌ల్పంగా పెరిగిన కేసులు

2591 New Corona Cases Reported In AP. నిన్న‌టితో పోలిస్తే ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా కేసుల సంఖ్య స్వ‌ల్పంగా పెరిగాయి. గ‌డిచిన 24

By Medi Samrat  Published on  14 July 2021 12:33 PM GMT
ఏపీ క‌రోనా బులిటెన్‌.. స్వ‌ల్పంగా పెరిగిన కేసులు

నిన్న‌టితో పోలిస్తే ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా కేసుల సంఖ్య స్వ‌ల్పంగా పెరిగాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో 90,204 శాంపిళ్ల‌ను పరీక్షించ‌గా.. 2,591 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బుధ‌వారం సాయంత్రం విడుద‌ల చేసిన బులిటెన్‌లో వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 19,29,579కి చేరింది. నిన్న 3,329 మంది క‌రోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 18,90,565కి పెరిగింది.

కోవిడ్ వల్ల చిత్తూర్ లో నలుగురు, ప్రకాశం లో ముగ్గురు, తూర్పు గోదావరి లో ఇద్దరు, శ్రీకాకుళం లో ఇద్దరు, అనంతపూర్, కర్నూల్, విజయనగరం, పశ్చిమ గోదావరిలలో ఒక్కొక్కరు చొప్పున మొత్తం 15 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో క‌రోనా వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 13,057కి చేరింది. ఇక రాష్ట్రంలో 25,957 యాక్టివ్ కేసులు ఉండ‌గా.. నేటి వరకు రాష్ట్రంలో 2,32,20,912 సాంపిల్స్ ని పరీక్షించారు.


Next Story