ఏపీ కరోనా బులిటెన్.. మళ్లీ పెరిగిన కేసులు
2567 New Corona Cases Reported In AP. నిన్నటితో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగాయి.
By Medi Samrat Published on
13 July 2021 11:36 AM GMT

నిన్నటితో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 81,763 శాంపిళ్లను పరీక్షించగా.. 2,567 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం సాయంత్రం విడుదల చేసిన బులిటెన్లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 19,26,988కి చేరింది. నిన్న 3,034 మంది కరోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 18,87,236కి పెరిగింది.
కోవిడ్ వల్ల గుంటూరులో నలుగురు, చిత్తూర్ లో ముగ్గురు, నెల్లూరు లో ముగ్గురు, తూర్పుగోదావరి లో ఇద్దరు, ప్రకాశం లో ఇద్దరు, పశ్చిమ గోదావరి లో ఇద్దరు, విశాఖపట్నం లో ఒక్కరు, విజయనగరం లో ఒక్కరు చొప్పున మొత్తం 18 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 13,042కి చేరింది. ఇక రాష్ట్రంలో 26,710 యాక్టివ్ కేసులు ఉండగా.. నేటి వరకు రాష్ట్రంలో 2,31,30,708 సాంపిల్స్ ని పరీక్షించారు.
Next Story