ఏపీ కరోనా బులిటెన్.. మళ్లీ పెరిగిన కేసులు
2527 New Corona Cases Reported In AP. నిన్నటితో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగాయి.
By Medi Samrat Published on 21 July 2021 11:17 AM GMT
నిన్నటితో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 86,280 శాంపిళ్లను పరీక్షించగా.. 2,527 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బుధవారం సాయంత్రం విడుదల చేసిన బులిటెన్లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 19,46,749కి చేరింది. నిన్న 2,412 మంది కరోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 19,09,613కి పెరిగింది.
#COVIDUpdates: 21/07/2021, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) July 21, 2021
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 19,43,854 పాజిటివ్ కేసు లకు గాను
*19,06,718 మంది డిశ్చార్జ్ కాగా
*13,197 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 23,939#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/84tdSaEaCf
కోవిడ్ వల్ల చిత్తూర్ లో నలుగురు, కృష్ణ లో ముగ్గురు, నెల్లూరు లో ముగ్గురు, తూర్పుగోదావరి లో ఇద్దరు, ప్రకాశం లో ఇద్దరు, పశ్చిమ గోదావరి లో ఇద్దరు, వైఎస్ఆర్ కడపలో ఒక్కరు, శ్రీకాకుళం లో ఒక్కరు, విశాఖపట్నం లో ఒక్కరు చొప్పున 19 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 13197కి చేరింది. ఇక రాష్ట్రంలో 23,939 యాక్టివ్ కేసులు ఉండగా.. నేటి వరకు రాష్ట్రంలో 2,38,38,636 సాంపిల్స్ ని పరీక్షించారు.