ఏపీ కరోనా బులిటెన్.. పెరిగిన మరణాలు
2526 New Corona Cases Reported In AP. నిన్నటితో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో
By Medi Samrat Published on 15 July 2021 2:34 PM GMT
నిన్నటితో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 93,785 శాంపిళ్లను పరీక్షించగా.. 2,526 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ గురువారం సాయంత్రం విడుదల చేసిన బులిటెన్లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 19,32,105కి చేరింది. నిన్న 2,933 మంది కరోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 18,93,498కి పెరిగింది.
#COVIDUpdates: 15/07/2021, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) July 15, 2021
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 19,29,210 పాజిటివ్ కేసు లకు గాను
*18,90,603 మంది డిశ్చార్జ్ కాగా
*13,081 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 25,526#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/SIzeHQ3NjX
కోవిడ్ వల్ల గడిచిన 24గంటల్లో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. అత్యధికంగా ప్రకాశం జిల్లాలో ఆరు మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 13,081కి చేరింది. ఇక రాష్ట్రంలో 25,526 యాక్టివ్ కేసులు ఉండగా.. నేటి వరకు రాష్ట్రంలో 2,33,14,697 సాంపిల్స్ ని పరీక్షించారు.