ఏపీ క‌రోనా బులిటెన్‌.. స్వ‌ల్పంగా పెరిగిన కేసులు

230 New Corona Cases Reported In AP. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 35,332

By Medi Samrat
Published on : 17 Nov 2021 1:43 PM

ఏపీ క‌రోనా బులిటెన్‌.. స్వ‌ల్పంగా పెరిగిన కేసులు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 35,332 పరీక్షలు నిర్వహించగా.. 230 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయిన‌ట్లు బుధ‌వారం సాయంత్రం విడుద‌ల చేసిన హెల్త్ బులిటెన్‌లో రాష్ట్ర వైద్యా రోగ్య శాఖ వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,70,516కి చేరింది. నిన్న క‌రోనా వ‌ల్ల ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 14,421కి చేరింది. 24 గంటల వ్యవధిలో 346 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 20,53,480కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2,615 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 3,00,66,415 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.


Next Story