ఏపీ క‌రోనా బులిటెన్‌.. మ‌ళ్లీ పెరిగిన కేసులు

2287 New Corona Cases Reported In AP. ఏపీలో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 85,856 శాంపిళ్ల‌ను పరీక్షించ‌గా..

By Medi Samrat  Published on  1 Aug 2021 2:22 PM GMT
ఏపీ క‌రోనా బులిటెన్‌.. మ‌ళ్లీ పెరిగిన కేసులు

ఏపీలో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 85,856 శాంపిళ్ల‌ను పరీక్షించ‌గా.. 2,287 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం సాయంత్రం విడుద‌ల చేసిన బులిటెన్‌లో వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 19,68,462కి చేరింది. నిన్న 2,430 మంది క‌రోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 19,34,048కి పెరిగింది.

కోవిడ్ వల్ల చిత్తూర్ లో నలుగురు, కృష్ణ లో ముగ్గురు, నెల్లూరు లో ముగ్గురు, తూర్పుగోదావరి లో ఇద్దరు, ప్రకాశం లో ఇద్దరు, గుంటూరు, కర్నూ ల్, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి లలో ఒక్కొక్కరు చొప్పున 18 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో క‌రోనా వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 13,395కి చేరింది. ఇక రాష్ట్రంలో 21,019 యాక్టివ్ కేసులు ఉండ‌గా.. నేటి వరకు రాష్ట్రంలో 2,46,48,899 సాంపిల్స్ ని పరీక్షించారు.




Next Story