ఏపీ కరోనా బులిటెన్.. మళ్లీ పెరుగుతున్న కేసులు
2,252 New Corona Cases Reported In AP. నిన్నటితో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగాయి.
By Medi Samrat Published on
25 July 2021 11:24 AM GMT

నిన్నటితో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 84,858 శాంపిళ్లను పరీక్షించగా.. 2,252 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం సాయంత్రం విడుదల చేసిన బులిటెన్లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 19,54,765కి చేరింది. నిన్న 2,440 మంది కరోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 19,19,354కి పెరిగింది.
కోవిడ్ వల్ల చిత్తూర్ లో నలుగురు, కృష్ణ లో ముగ్గురు, తూర్పు గోదావరి లో ఇద్దరు, వైఎస్ఆర్ కడప, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి లలో ఒక్కొక్కరు చొప్పున 15 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 13,256కి చేరింది. ఇక రాష్ట్రంలో 22,155 యాక్టివ్ కేసులు ఉండగా.. నేటి వరకు రాష్ట్రంలో 2,41,34,961 సాంపిల్స్ ని పరీక్షించారు.
Next Story