ఏపీ కరోనా బులిటెన్.. మళ్లీ పెరిగిన మరణాలు
2145 New Corona Cases In AP. ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 82,297 శాంపిళ్లను పరీక్షించగా..
By Medi Samrat Published on 5 Aug 2021 12:32 PM GMT
ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 82,297 శాంపిళ్లను పరీక్షించగా.. 2,145 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ గురువారం సాయంత్రం విడుదల చేసిన బులిటెన్లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 19,76,141కి చేరింది. నిన్న 2,003 మంది కరోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 19,42,371కి పెరిగింది.
#COVIDUpdates: 05/08/2021, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) August 5, 2021
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 19,73,246 పాజిటివ్ కేసు లకు గాను
*19,39,476 మంది డిశ్చార్జ్ కాగా
*13,468 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 20,302#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/TSL6JRwP3X
కోవిడ్ వల్ల ప్రకాశం లో ఐదుగురు, చిత్తూరులో నలుగురు, కృష్ణలో నలుగురు, కడపలో ముగ్గురు, పశ్చిమగోదావరిలో ముగ్గురు, తూర్పుగోదావరిలో ఇద్దరు, అనంతపురంలో ఒక్కరు, గుంటూరు ఒక్కరు, విశాఖపట్నంలో ఒక్కొరు చొప్పున మొత్తం 24 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 13,468కి చేరింది. ఇక రాష్ట్రంలో 20,302 యాక్టివ్ కేసులు ఉండగా.. నేటి వరకు రాష్ట్రంలో 2,49,46,265సాంపిల్స్ ని పరీక్షించారు.