ఏపీ క‌రోనా బులిటెన్‌.. మ‌ళ్లీ పెరిగిన కేసులు

2107 New Corona Cases Reported In AP. ఏపీలో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 78,784 శాంపిళ్ల‌ను పరీక్షించ‌గా.

By Medi Samrat  Published on  29 July 2021 11:41 AM GMT
ఏపీ క‌రోనా బులిటెన్‌.. మ‌ళ్లీ పెరిగిన కేసులు

ఏపీలో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 78,784 శాంపిళ్ల‌ను పరీక్షించ‌గా.. 2,107 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ గురువారం సాయంత్రం విడుద‌ల చేసిన బులిటెన్‌లో వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 19,62,049కి చేరింది. నిన్న 1,807 మంది క‌రోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 19,27,438కి పెరిగింది.

కోవిడ్ వల్ల కృష్ణ లో ఆరుగురు, చిత్తూర్ లో నలుగురు, ప్రకాశం లో నలుగురు, అనంతపూర్, తూర్పు గోదావరి, వైఎస్ఆర్ కడప, నెల్లూరు, విశాఖపట్నం మరియు పశ్చిమ గోదావరిలో ఒక్కొక్కరు చొప్పున 20 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో క‌రోనా వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 13,332కి చేరింది. ఇక రాష్ట్రంలో 21,279 యాక్టివ్ కేసులు ఉండ‌గా.. నేటి వరకు రాష్ట్రంలో 2,44,03,410 సాంపిల్స్ ని పరీక్షించారు.


Next Story