ఏపీ కరోనా బులిటెన్.. కొత్తగా ఎన్ని కేసులంటే..
2050 New Corona Cases Reported In AP. ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 85,283 శాంపిళ్లను పరీక్షించగా..
By Medi Samrat Published on
8 Aug 2021 11:56 AM GMT

ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 85,283 శాంపిళ్లను పరీక్షించగా.. 2,050 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం సాయంత్రం విడుదల చేసిన బులిటెన్లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 19,82,308కి చేరింది. నిన్న 2,458 మంది కరోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 19,48,828కి పెరిగింది.
కోవిడ్ వల్ల చిత్తూర్ లో ఐదుగురు, కృష్ణ లో ఐదుగురు, తూర్పు గోదావరి లో ఇద్దరు, గుంటూరు లో ఇద్దరు, అనంతపూర్, ప్రకాశం , విశాఖపట్నం, పశ్చిమ గోదావరిలలో ఒక్కొక్కరు చొప్పున మొత్తం 18 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 13,531కి చేరింది. ఇక రాష్ట్రంలో 19,949 యాక్టివ్ కేసులు ఉండగా.. నేటి వరకు రాష్ట్రంలో 2,51,93,429 సాంపిల్స్ ని పరీక్షించారు.
Next Story