ఏపీలో కొత్త‌గా 1,908 పాజిటివ్ కేసులు.. పెరిగిన మ‌ర‌ణాలు

1908 New Corona Cases Reported In AP. ఏపీలో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 80,376 శాంపిళ్ల‌ను పరీక్షించ‌గా..

By Medi Samrat  Published on  7 Aug 2021 12:03 PM GMT
ఏపీలో కొత్త‌గా 1,908 పాజిటివ్ కేసులు.. పెరిగిన మ‌ర‌ణాలు

ఏపీలో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 80,376 శాంపిళ్ల‌ను పరీక్షించ‌గా.. 1,908 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ శ‌నివారం సాయంత్రం విడుద‌ల చేసిన బులిటెన్‌లో వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 19,80,258కి చేరింది. నిన్న 2,103 మంది క‌రోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 19,46,370కి పెరిగింది.

కోవిడ్ వల్ల కృష్ణ లో నలుగురు, చిత్తూర్ లో ముగ్గురు, గుంటూరు లో ముగ్గురు, పశ్చిమగోదావరి లో ముగ్గురు, అనంతపూర్ లో ఇద్దరు, తూర్పు గోదావరి లో ఇద్దరు, నెల్లూరు లో ఇద్దరు, ప్రకాశం లో ఇద్దరు, శ్రీకాకుళం లో ఒక్కరు, విశాఖపట్నం లో ఒక్కరు చొప్పున మొత్తం 23 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో క‌రోనా వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 13,513కి చేరింది. ఇక రాష్ట్రంలో 20,375 యాక్టివ్ కేసులు ఉండ‌గా.. నేటి వరకు రాష్ట్రంలో 2,51,08,146 సాంపిల్స్ ని పరీక్షించారు.


Next Story