ఏపీ కరోనా బులిటెన్.. ఎన్ని కేసులంటే..
1859 New Corona Cases Reported In AP. ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 70,757 శాంపిళ్లను పరీక్షించగా..
By Medi Samrat Published on 12 Aug 2021 11:13 AM GMT
ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 70,757 శాంపిళ్లను పరీక్షించగా.. 1,859 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ గురువారం సాయంత్రం విడుదల చేసిన బులిటెన్లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 19,88,910కి చేరింది. నిన్న 1,575 మంది కరోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 19,56,627కి పెరిగింది.
#COVIDUpdates: 12/08/2021, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) August 12, 2021
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 19,86,015 పాజిటివ్ కేసు లకు గాను
*19,53,732 మంది డిశ్చార్జ్ కాగా
*13,595 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 18,688#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/UWZctpDGVZ
కోవిడ్ వల్ల చిత్తూర్ లో నలుగురు, కృష్ణ లో ముగ్గురు, తూర్పు గోదావరి లో ఇద్దరు, ప్రకాశం లో ఇద్దరు, నెల్లూరు, విశాఖపట్నం లలో ఒక్కొక్కరు చొప్పున మొత్తం 13 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 13,595కి చేరింది. ఇక రాష్ట్రంలో 18,688 యాక్టివ్ కేసులు ఉండగా.. నేటి వరకు రాష్ట్రంలో 2,54,53,520 సాంపిల్స్ ని పరీక్షించారు.