ఏపీలో తగ్గిన కరోనా కేసులు, పెరిగిన మరణాలు
1628 New Corona Cases Reported In AP. నిన్నటితో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో
By Medi Samrat Published on
19 July 2021 12:12 PM GMT

నిన్నటితో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 71,152 శాంపిళ్లను పరీక్షించగా.. 1,628 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం సాయంత్రం విడుదల చేసిన బులిటెన్లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 19,41,724కి చేరింది. నిన్న 2,744 మంది కరోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 19,05,000 కి పెరిగింది.
కోవిడ్ వల్ల చిత్తూర్ లో ఐదుగురు, కృష్ణలో నలుగురు, గుంటూరు లో ముగ్గురు, ప్రకాశంలో ముగ్గురు, అనంతపూర్ లో ఇద్దరు, తూర్పు గోదావరి, కర్నూల్, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం లలో ఒక్కొక్క రు చొప్పున 22 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 13,154కి చేరింది. ఇక రాష్ట్రంలో 23,570 యాక్టివ్ కేసులు ఉండగా.. నేటి వరకు రాష్ట్రంలో 2,36,64,207 సాంపిల్స్ ని పరీక్షించారు.
Next Story