ఏపీ కరోనా బులిటెన్.. తగ్గిన కేసులు, పెరిగిన మరణాలు
1627 New Corona Cases Reported In AP. నిన్నటితో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగాయి. గడిచిన 24 గంటల్
By Medi Samrat Published on
26 July 2021 12:54 PM GMT

నిన్నటితో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 57,672 శాంపిళ్లను పరీక్షించగా.. 1,627 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం సాయంత్రం విడుదల చేసిన బులిటెన్లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 19,56,392కి చేరింది. నిన్న 2,017 మంది కరోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 19,21,371కి పెరిగింది.
కోవిడ్ వల్ల చిత్తూర్ లో ఐదుగురు, కృష్ణ లో ఐదుగురు, తూర్పు గోదావరి లో ఇద్దరు, విశాఖపట్నంలో ఇద్దరు, కడపలో ఒకరు, నెల్లూరులో ఒకరు, పశ్చిమ గోదావరి లలో ఒకరు చొప్పున 17 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 13,273కి చేరింది. ఇక రాష్ట్రంలో 21,748 యాక్టివ్ కేసులు ఉండగా.. నేటి వరకు రాష్ట్రంలో 2,41,92,633 సాంపిల్స్ ని పరీక్షించారు.
Next Story