ఏపీ కరోనా బులిటెన్.. మళ్లీ పెరిగిన కేసులు
1623 New Corona Cases Reported In AP. ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 65,596 పరీక్షలు
By Medi Samrat Published on
5 Sep 2021 12:35 PM GMT

ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 65,596 పరీక్షలు నిర్వహించగా.. 1,623 కేసులు నిర్ధారణ అయినట్లు ఆదివారం సాయంత్రం విడుదల చేసిన హెల్త్ బులిటెన్లో రాష్ట్ర వైద్యా రోగ్య శాఖ వెల్లడించింది. నిన్నటితో పోలిస్తే నేడు కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగాయి. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,21,325కి చేరింది. నిన్న కరోనా వల్ల 8 మంది మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 13,911కి చేరింది. 24 గంటల వ్యవధిలో 1,340 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 19,92,256కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 15,158 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,69,39,087 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.
https://twitter.com/ArogyaAndhra/status/1434488876828008448
Next Story