ఏపీ క‌రోనా బులిటెన్‌.. మ‌ళ్లీ పెరుగుతున్న కేసులు

162 New Corona Cases reported In AP. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 31,743

By Medi Samrat
Published on : 29 Dec 2021 5:10 PM IST

ఏపీ క‌రోనా బులిటెన్‌.. మ‌ళ్లీ పెరుగుతున్న కేసులు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 31,743 పరీక్షలు నిర్వహించగా.. 162 కొత్త పాజిటివ్ కేసులు నిర్ధారణ అయిన‌ట్లు బుధ‌వారం సాయంత్రం విడుద‌ల చేసిన హెల్త్ బులిటెన్‌లో రాష్ట్ర వైద్యా రోగ్య శాఖ వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,76,849కి చేరింది. క‌రోనా వ‌ల్ల నిన్న ఎటువంటి మ‌ర‌ణం సంభ‌వించ‌లేదు. రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 14,492గా ఉంది. 24 గంటల వ్యవధిలో 186 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 20,61,308కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,049 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 3,12,62,099 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.



Next Story