ఏపీ క‌రోనా బులిటెన్‌.. ఆగ‌ని మ‌ర‌ణాలు.. 24 గంట‌ల్లో 8 మంది మృత్యువాత‌

1597 New Corona Cases Reported In AP. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ ఆగడం లేదు. రాష్ట్రంలో ఇవాళ కూడా

By Medi Samrat  Published on  7 Feb 2022 12:18 PM GMT
ఏపీ క‌రోనా బులిటెన్‌.. ఆగ‌ని మ‌ర‌ణాలు.. 24 గంట‌ల్లో 8 మంది మృత్యువాత‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ ఆగడం లేదు. రాష్ట్రంలో ఇవాళ కూడా కరోనా కేసులు సంఖ్య ప‌దిహేను వంద‌ల‌కుపైగా నమోదయ్యాయి. కరోనా మరణాలు కూడా ఎక్కువ‌గానే న‌మోద‌య్యాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 18,601 పరీక్షలు నిర్వహించగా.. 1,597 కొత్త పాజిటివ్ కేసులు నిర్ధారణ అయిన‌ట్లు సోమ‌వారం సాయంత్రం విడుద‌ల చేసిన హెల్త్ బులిటెన్‌లో రాష్ట్ర వైద్యా రోగ్య శాఖ వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 23,05,052కి చేరింది.

క‌రోనా వ‌ల్ల నిన్న ఎనిమిది మంది మృత్యువాత ప‌డ్డారు. కోవిడ్ వల్ల విశాఖపట్నంలో ఇద్దరు, చిత్తూరు, తూర్పు గోదావరి, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం మరియు పశ్చిమ గోదావరి లలో ఒక్కొక్కరు చొప్పు న మరణించారు. రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 14,672గా ఉంది. 24 గంటల వ్యవధిలో 8,766 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 22,27,985కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 62,395 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 3,26,79,288 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.


Next Story