ఏపీ క‌రోనా బులిటెన్‌.. పెరిగిన మ‌ర‌ణాలు

1546 New Corona Cases Reported In AP. ఏపీలో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 69,606 శాంపిళ్ల‌ను పరీక్షించ‌గా..

By Medi Samrat  Published on  3 Aug 2021 12:13 PM GMT
ఏపీ క‌రోనా బులిటెన్‌.. పెరిగిన మ‌ర‌ణాలు

ఏపీలో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 69,606 శాంపిళ్ల‌ను పరీక్షించ‌గా.. 1,546 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంగ‌ళ‌వారం సాయంత్రం విడుద‌ల చేసిన బులిటెన్‌లో వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 19,71,554కి చేరింది. నిన్న 1,940 మంది క‌రోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 19,37,956కి పెరిగింది.

కోవిడ్ వల్ల చిత్తూర్ లో న‌లుగురు, కృష్ణ లో ముగ్గురు, అనంత‌పూర్‌లో ఇద్ద‌రు, తూర్పుగోదావరి లో ఇద్దరు, గుంటూరు లో ఇద్ద‌రు, నెల్లూరులో ఇద్ద‌రు, ప్ర‌కాశంలో ఒక్కరు, శ్రీకాకుళంలో ఒక్క‌రు, విశాఖ‌ప‌ట్నంలో ఒక్క‌రు చొప్పున 18 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో క‌రోనా వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 13,428కి చేరింది. ఇక రాష్ట్రంలో 20,170 యాక్టివ్ కేసులు ఉండ‌గా.. నేటి వరకు రాష్ట్రంలో 2,47,78,146 సాంపిల్స్ ని పరీక్షించారు.


Next Story