ఏపీ కరోనా బులిటెన్.. తగ్గిన కేసులు, మరణాలు
1546 New Corona Cases Reported In AP. ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 59,641 శాంపిళ్లను పరీక్షించగా..
By Medi Samrat Published on
2 Aug 2021 12:29 PM GMT

ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 59,641 శాంపిళ్లను పరీక్షించగా.. 1,546 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం సాయంత్రం విడుదల చేసిన బులిటెన్లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 19,70,008కి చేరింది. నిన్న 1,968 మంది కరోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 19,36,016కి పెరిగింది.
కోవిడ్ వల్ల చిత్తూర్ లో ఐదుగురు, కృష్ణ లో ముగ్గురు, ప్రకాశం లో ముగ్గురు, తూర్పుగోదావరి లో ఇద్దరు, గుంటూరు లో ఒక్కరు, శ్రీకాకుళం లో ఒక్కరు చొప్పున 15 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 13,410కి చేరింది. ఇక రాష్ట్రంలో 20,582 యాక్టివ్ కేసులు ఉండగా.. నేటి వరకు రాష్ట్రంలో 2,47,08,540 సాంపిల్స్ ని పరీక్షించారు.
Next Story