ఏపీ క‌రోనా బులిటెన్‌.. ఒకే రోజు 16 మర‌ణాలు

1502 New Corona Cases Reported In AP. ఏపీలో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 63,717 పరీక్షలు

By Medi Samrat
Published on : 4 Sept 2021 5:32 PM IST

ఏపీ క‌రోనా బులిటెన్‌.. ఒకే రోజు 16 మర‌ణాలు

ఏపీలో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 63,717 పరీక్షలు నిర్వహించగా.. 1,502 కేసులు నిర్ధారణ అయిన‌ట్లు శ‌నివారం సాయంత్రం విడుద‌ల చేసిన హెల్త్ బులిటెన్‌లో రాష్ట్ర వైద్యా రోగ్య శాఖ వెల్ల‌డించింది. నిన్న‌టితో పోలిస్తే నేడు కేసుల సంఖ్య స్వ‌ల్పంగా త‌గ్గింది. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,19,702 కి చేరింది. నిన్న క‌రోనా వ‌ల్ల 16 మంది మృత్యువాత ప‌డ్డారు. దీంతో రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 13,903కి చేరింది. 24 గంటల వ్యవధిలో 1,525 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 19,90,916కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 14,883 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,68,73,491 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.


Next Story