ఏపీలో భారీగా పెరిగిన క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు

14669 New Corona Cases Reported In AP. ఆంధ్రప్రదేశ్‌లో క‌రోనా మ‌హ‌మ్మారి క‌రాళ నృత్యం చేస్తోంది. గ‌త కొద్ది రోజులుగా ఈ మ‌హ‌మ్మారి

By Medi Samrat  Published on  28 April 2021 1:23 PM GMT
ఏపీలో భారీగా పెరిగిన క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు

ఆంధ్రప్రదేశ్‌లో క‌రోనా మ‌హ‌మ్మారి క‌రాళ నృత్యం చేస్తోంది. గ‌త కొద్ది రోజులుగా ఈ మ‌హ‌మ్మారి బారిన ప‌డుతున్న వారి సంఖ్య క్ర‌మంగా పెరుగుతోంది. గ‌డిచిన‌ 24 గంటల్లో 74,748 ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా.. 14,669 కేసులు నిర్ధ‌రాణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన‌ పాజ‌టివ్ కేసుల సంఖ్య 10,69,544కు చేరింది. అత్య‌ధికంగా గుంటూరు జిల్లాలో 2,072 కేసులు న‌మోదు కాగా.. అత్య‌ల్పంగా క‌డ‌ప‌ జిల్లాలో 486 కేసులు చొప్పున‌ న‌మోదు అయ్యాయి.

కోవిడ్ వల్ల నిన్న ఒక్క‌రోజే నెల్లూరులో తొమ్మిది మంది, కృష్ణ లో ఎనిమిది మంది, అనంతపూర్ లో ఏడుగురు, తూర్పు గోదావరిలో ఏడుగురు, విజయనగరం లో ఏడుగురు, చిత్తూర్ లో ఆరుగురు, పశ్చి మ గోదావరి లో ఆరుగురు, విశాఖపట్నం లో ఐదుగురు, గుంటూరులో నలుగురు, కర్నూ ల్ లో నలుగురు, ప్రకాశం లో ముగ్గురు, శ్రీకాకుళం లో ముగ్గురు, వైఎస్ఆర్ కడప జిల్లాలో ఇద్దరు చొప్పున మొత్తం 71 మంది మరణించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 7,871కి చేరింది. నిన్న ఒక్క రోజే 6,433 మంది క‌రోనా నుంచి కోలుకోగా.. ఇప్ప‌టి వ‌ర‌కు కోలుకున్న వారి సంఖ్య 9,54,062కి చేరింది. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 1,07,611 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 162,17,831 శాంపిల్స్ ను పరీక్షించారు.




Next Story