ఏపీలో త‌గ్గిన క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు

1461 New Corona Cases Reported In AP. ఏపీలో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 63,849 శాంపిళ్ల‌ను పరీక్షించ‌గా..

By Medi Samrat  Published on  10 Aug 2021 12:01 PM GMT
ఏపీలో త‌గ్గిన క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు

ఏపీలో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 63,849 శాంపిళ్ల‌ను పరీక్షించ‌గా.. 1,461 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంగ‌ళ‌వారం సాయంత్రం విడుద‌ల చేసిన బులిటెన్‌లో వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 19,85,182కి చేరింది. నిన్న 2,113 మంది క‌రోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 19,52,736కి పెరిగింది.

కోవిడ్ వల్ల చిత్తూర్ లో ఆరుగురు, కృష్ణ లో ముగ్గురు, నెల్లూరులో ముగ్గురు, తూర్పుగోదావరి లో ఇద్దరు, పశ్చిమ గోదావరి లో ఒక్కరు చొప్పున మొత్తం 15 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో క‌రోనా వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 13,564కి చేరింది. ఇక రాష్ట్రంలో 18,882 యాక్టివ్ కేసులు ఉండ‌గా.. నేటి వరకు రాష్ట్రంలో 2,53,11,733 సాంపిల్స్ ని పరీక్షించారు.




Next Story