ఏపీ కరోనా బులిటెన్.. వందకుపైగా మరణాలు
14429 New Corona Cases Reported In AP. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 84,502
By Medi Samrat Published on 28 May 2021 2:16 PM GMT
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 84,502 శాంపిళ్లను పరీక్షించగా.. 14,429 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ గురువారం సాయంత్రం విడుదల చేసిన బులిటెన్లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 16,57,986కి చేరింది. నిన్న 20,746 మంది కరోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 14,66,990కి పెరిగింది.
#COVIDUpdates: 28/05/2021, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) May 28, 2021
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 16,55,091 పాజిటివ్ కేసు లకు గాను
*14,64,095 మంది డిశ్చార్జ్ కాగా
*10,634 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,80,362#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/qDcNN1xyIn
కోవిడ్ వల్ల నిన్న ఒక్కరోజే 103 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో రాష్ట్రంలో కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 10,634కి చేరింది. ఇక రాష్ట్రంలో 1,80,362 యాక్టివ్ కేసులు ఉండగా.. నేటి వరకు రాష్ట్రంలో 1,90,09,047 సాంపిల్స్ ని పరీక్షించారు.