ఏపీ కరోనా బులిటెన్.. మళ్లీ పెరిగిన కేసులు
1439 New Corona Cases Reported In AP. ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 62,856 పరీక్షలు
By Medi Samrat Published on
9 Sep 2021 11:13 AM GMT

ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 62,856 పరీక్షలు నిర్వహించగా.. 1,439 కేసులు నిర్ధారణ అయినట్లు గురువారం సాయంత్రం విడుదల చేసిన హెల్త్ బులిటెన్లో రాష్ట్ర వైద్యా రోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,26,042కి చేరింది. నిన్న కరోనా వల్ల 14 మంది మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 13,964కి చేరింది. 24 గంటల వ్యవధిలో 1,311 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 19,97,454కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 14,624 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,71,61,870 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.
Next Story