ఏపీలో ఇర‌వై ల‌క్ష‌లు ధాటిన క‌రోనా కేసులు

1435 New Corona Cases Reported In AP. ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 69,173 పరీక్షలు నిర్వహించగా.. 1,435

By Medi Samrat  Published on  20 Aug 2021 12:02 PM GMT
ఏపీలో ఇర‌వై ల‌క్ష‌లు ధాటిన క‌రోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 69,173 పరీక్షలు నిర్వహించగా.. 1,435 కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 20,00,038 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్యరోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్‌ వల్ల ఆరుగురు మంది బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 13,702కి చేరింది. 24 గంటల వ్యవధిలో 1,695 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 19,70,864కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 15,472 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,59,72,539 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.


Next Story