ఏపీలో భారీగా త‌గ్గిన క‌రోనా కేసులు.. 24 గంట‌ల్లో ముగ్గురు మృత్యువాత‌

141 New Corona Cases Reported In AP. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రంలో క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌ట్టాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా

By Medi Samrat  Published on  26 Feb 2022 11:58 AM GMT
ఏపీలో భారీగా త‌గ్గిన క‌రోనా కేసులు.. 24 గంట‌ల్లో ముగ్గురు మృత్యువాత‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రంలో క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌ట్టాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 15,213 పరీక్షలు నిర్వహించగా.. 141 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయిన‌ట్లు శ‌నివారం సాయంత్రం విడుద‌ల చేసిన హెల్త్ బులిటెన్‌లో రాష్ట్ర వైద్యా రోగ్య శాఖ వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 23,17,605కి చేరింది. క‌రోనా వ‌ల్ల నిన్న ఒక్క‌రోజే ముగ్గురు మృత్యువాత ప‌డ్డారు. కోవిడ్ వల్ల చిత్తూరు, కృష్ణా మరియు విశాఖపట్నం లలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి మ‌ర‌ణించిన వారి సంఖ్య 14,725గా చేరింది. 24 గంటల వ్యవధిలో 1,329 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 22,99,362కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 3,518 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 3,30,81,987 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.



Next Story