ఏపీలో మ‌ళ్లీ పెరిగిన క‌రోనా కేసులు

1395 Corona Cases In AP. ఏపీలో కరోనా పాజిటివ్‌ కేసులు మళ్లీ పెరిగాయి. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా

By Medi Samrat  Published on  17 Nov 2020 2:56 PM GMT
ఏపీలో మ‌ళ్లీ పెరిగిన క‌రోనా కేసులు

ఏపీలో కరోనా పాజిటివ్‌ కేసులు మళ్లీ పెరిగాయి. నిన్న‌టి బులెటిన్‌లో 753 కేసులు మాత్రమే నమోదు కాగా.. తాజా కరోనా బులెటిన్‌ ప్రకారం.. మళ్లీ కొత్త కేసులు వెయ్యికి పైగా నమోదు అయ్యాయి. గడిచిన‌ 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 66,778 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా... 1,395 కొత్త పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. కరోనాబారినపడి 9 మంది మృతిచెందారు.

ఇదే సమయంలో 2,293 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. తాజా కరోనా నిర్ధారణ పరీక్షలు కలుపుకొని ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కరోనా టెస్ట్‌ల సంఖ్య 92,64,085కు చేరింది. తాజాగా చిత్తూరు, కృష్ణా జిల్లా, విశాఖపట్నంలో ఇద్దరు చొప్పున, అనంతపురం, తూర్పు గోదావరి, కడప జిల్లాలో ఒక్కరు చొప్పున మరణించారు.

ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 8,56,159కు చేరుకోగా.. ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 8,32,284కు పెరిగింది. ఇక, 6,890 మంది ఇప్పటి వరకు కరోనాబారినపడి మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 16,985 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.


Next Story