ఏపీ క‌రోనా బులిటెన్‌.. త‌గ్గిన కేసులు.. వందకు పైగా మ‌ర‌ణాలు

13756 New Corona Cases Reported In AP. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి కొన‌సాగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో

By Medi Samrat  Published on  29 May 2021 1:52 PM GMT
ఏపీ క‌రోనా బులిటెన్‌.. త‌గ్గిన కేసులు.. వందకు పైగా మ‌ర‌ణాలు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి కొన‌సాగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 79,564 శాంపిళ్ల‌ను పరీక్షించ‌గా.. 13,756 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ శ‌నివారం సాయంత్రం విడుద‌ల చేసిన బులిటెన్‌లో వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 16,71,742కి చేరింది. నిన్న 20,392 మంది క‌రోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 14,87,382కి పెరిగింది.

కోవిడ్ వల్ల పశ్చిమ గోదావరి లో ఇరవై మంది, చిత్తూర్ లో పదమూడు మంది, విశాఖపట్నం లో పది, అనంతపూర్ లో తొమ్మిది, తూర్పు గోదావరి లో తొమ్మిది, గుంటూరు లో ఎనిమిది, కృష్ణలో ఎనిమిది, కర్నూల్ లో ఏడుగురు, నెల్లూరు లో ఆరుగురు, విజయనగరం లో ఆరుగురు, శ్రీకాకుళం లో ఐదుగురు, వైఎస్ఆర్ కడప లో ఇద్దరు, ప్రకాశం లో ఒక్కరు చొప్పున మొత్తం 104 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో రాష్ట్రంలో క‌రోనా వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 10,738కి చేరింది. ఇక రాష్ట్రంలో 1,73,622 యాక్టివ్ కేసులు ఉండ‌గా.. నేటి వరకు రాష్ట్రంలో 1,90,88,611 సాంపిల్స్ ని పరీక్షించారు.


Next Story